నా నరనరాన ప్రవహించే రక్తంలోనే సిక్కిజమ్..: సిక్కు ప్రముఖులతో ప్రధాని మోదీ

న్యూడిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు సమయం దగ్గరపడ్డ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సిక్కు ప్రముఖులతో సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

First Published Feb 18, 2022, 3:27 PM IST | Last Updated Feb 18, 2022, 3:27 PM IST

న్యూడిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు సమయం దగ్గరపడ్డ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సిక్కు ప్రముఖులతో సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా సిక్కు ప్రముఖులు కూడా ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ''నా నరనరాన ప్రవహిస్తున్న రక్తంలో సిక్కిజమ్ దాగివుంది'' అని ప్రధాని తమతో అన్నారని యమునానగర్ సేవాపంతి అధ్యక్షులు మహంత్ కరంజిత్ సింగ్ పేర్కొన్నారు. డిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షులు హర్మీత్ సింగ్ కల్క మాట్లాడుతూ... సిక్కులపై ప్రధాని మోదీ చూపిన ప్రేమ తమకు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇలా సిక్కు ప్రముఖులందరూ మోదీని కొనియాడారు.