Asianet News TeluguAsianet News Telugu

పరీక్షకు హాజరుకావాలంటే తలపాగా తొలగించాల్సిందే...

మధ్యప్రదేశ్ ధార్లో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో అధికారుల అత్యుత్సాహం ఓ విద్యార్థి మతవిశ్వాసాలను దెబ్బతీసింది. 

మధ్యప్రదేశ్ ధార్లో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో అధికారుల అత్యుత్సాహం ఓ విద్యార్థి మతవిశ్వాసాలను దెబ్బతీసింది. 12 వ తరగతికి చెందిన సిక్కు విద్యార్థిని ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అవ్వాలంటే తలపాగా తొలగించాలని కోరారు. అలా చేయడం తన మతవిశ్వాసాలకు విరుద్ధమని ఎంత చెప్పినా వినలేదని ఆ విద్యార్థి ఆవేదన చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి మంగలేష్ వ్యాస్ తెలిపారు.