Russia Ukraine Crisis:ఉక్రెయిన్ బార్డర్ దాటిన మరికొందరు ఇండియన్స్... సురక్షితంగా హంగేరీకి

న్యూడిల్లీ: రష్యా సైనిక చర్యకు దిగడంతో ఉక్రెయిన్ దేశంలో భయానక పరిస్థితి నెలకొంది. 

First Published Feb 27, 2022, 12:18 PM IST | Last Updated Feb 27, 2022, 12:18 PM IST

న్యూడిల్లీ: రష్యా సైనిక చర్యకు దిగడంతో ఉక్రెయిన్ దేశంలో భయానక పరిస్థితి నెలకొంది. బాంబుల, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు ఎయిరిండియా విమానాల్లో కొందరు బారతీయులు ముంబైకి, మరికొందరు న్యూడిల్లీకి చేరుకున్నారు. ఇక తాజాగా మరికొందరు ఉక్రెయిన్ నుండి హంగేరీకి చేరుకోగా వారిని ప్రత్యేక బస్సుల్లో విమానాశ్రయానికి తరలిస్తున్నారు. ఇక దేశ రాజధానికి చేరుకున్న భారతీయులకు స్వయంగా మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు.