Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ సముద్ర సేతు : రెండో విడతలో 700 మంది భారతీయులు స్వదేశానికి...

లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఉద్దేశించిన ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది.

లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఉద్దేశించిన ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే భార‌త యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ మాల్దీవులు నుంచి 698 మంది భార‌తీయులను తీసుకుని మే 10న భార‌త్‌కు చేరింది. ఇప్పుడు రెండో విడతలో మ‌రో 700 మంది భారతీయులు శుక్రవారం ఉదయం కొచ్చీ తీరానికి చేరుకున్నారు. వీరిలో వందమంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.