Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Politics : ఉద్ధవ్ ఠాక్రే మంత్రిమండలిలో క్రిమినల్స్

మహారాష్ట్ర కొత్త మంత్రిమండలిలోని 27 సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి. ఎన్నికల నామినేషన్ సమయంలో సమర్పించిన అఫడవిట్ లో ఈ విషయాలు బయటపడ్డాయి. 

మహారాష్ట్ర కొత్త మంత్రిమండలిలోని 27 సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి. ఎన్నికల నామినేషన్ సమయంలో సమర్పించిన అఫడవిట్ లో ఈ విషయాలు బయటపడ్డాయి. వీరిలోనూ 18 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఈ మండలిలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సహా మొత్తం 43 మంది మంత్రులు ఉన్నారు. అయితే వీరిలో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రుల డేటా వారి వారి అఫిడవిట్లలో లభించింది.  ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయనందున ఆయన డేటా లభించలేదు.