Asianet News TeluguAsianet News Telugu

ప్రవాసీలతో కేటీఆర్ సంక్రాంతి సంబరాలు... స్విట్జర్లాండ్ లో ఐటీ మంత్రి సందడి

జురిచ్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు.

జురిచ్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో వున్న మంత్రి జురిచ్ నగరంలో ప్రవాసీలు ఏర్పాటుచేసిన 'మీట్ ఆండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రవాస భారతీయులకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపారు.   ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మీతో మకర సంక్రాంతి జరుపుకునే అవకాశం కల్పించిన ప్రవాసీ భారతీయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయుల కంటే ప్రవాసీ భారతీయులే దేశ వ్యవహారాలు, స్థానిక అంశాలు, అభివృద్ది పట్ల ఎక్కువ మక్కువ వుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్దిని సాధిస్తోందని కేటీఆర్ అన్నారు.