భీమ్లా నాయక్ టికెట్ల వివాదం... విజయవాడలో పవన్ అభిమానుల ఆందోళన
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇవాళ(శుక్రవారం) విడుదలయ్యింది.
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇవాళ(శుక్రవారం) విడుదలయ్యింది. ఇప్పటికే తెలంగాణలో సినిమా ప్రదర్శన మొదలవగా ఏపీలో మాత్రం బెనిఫిట్ షో లకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. అంతేకాదు సాధారణంగా ప్రదర్శించే షోలకు కూడా టికెట్లను ఆన్ లైన్ లోనే కాదు థియేటర్ల వద్ద అందుబాటులో వుంచడం లేదట. దీంతో విజయవాడ గాంధీనగర్ జీ3 థియేటర్ వద్ద భీమ్లా నాయక్ టికెట్ల కోసం పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు.