Asianet News TeluguAsianet News Telugu

సొంత కొడుకు, కూతురికే స్టార్ యాక్టర్ సముద్రఖని ఛాలెంజ్...

హైదరాబాద్ :  ప్రముఖ దర్శకుడు. నటుడు సముద్రఖని బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించి ముందుకు తీసుకువెళుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు.

హైదరాబాద్ :  ప్రముఖ దర్శకుడు. నటుడు సముద్రఖని బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించి ముందుకు తీసుకువెళుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు. ఇటీవలే  దర్శకుడు ఎం. శశికుమార్ ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి సముద్రఖనికి ఛాలెంజ్ విసిరారు. దీంతో ఇవాళ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్క నాటారు సముద్రఖని.  అనంతరం పచ్చటి కండువాను తలకు ధరించి తాను నాటిన మొక్కతో సముద్రఖని సెల్పీ దిగారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తన బిడ్డలను కూడా భాగస్వామ్యం చేయనున్నట్లు సముద్రఖని పేర్కొన్నారు. అందుకోసమే తన తనయుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీతో పాటు దర్శకుడు వినోద్ కు ఈ గ్రీన్ ఇండియా విసురుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు దీన్ని సామాజిక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని సముద్రఖని పిలుపునిచ్చారు. 

Video Top Stories