Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్యకేసులో సిబిఐ నోటీసులు... వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిబిఐ తనకు నోటీసులు జారీచేయడంపై వైసిపి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిబిఐ తనకు నోటీసులు జారీచేయడంపై వైసిపి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. తనపై కావాలనే ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని... రెండున్నరేళ్లుగా తన కుటుంబాన్ని టార్గెట్ చేసారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారి కుటుంబాలకే ఈ పరిస్థితి ఎదురయితే ఎలా వుంటుందో ఊహించుకోవాలని... ఇకనైనా తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని అవినాష్ రెడ్డి సూచించారు. తనపై వస్తున్న ఆరోపణలను జీర్ణించుకోలేకపోతున్నానని... కానీ నేనేమిటో ప్రజలందరికీ తెలుసు కాబట్టే మౌనంగా భరిస్తున్నానని అన్నారు. న్యాయం గెలవాలి... నిజం వెల్లడి కావాలనే తాను కూడా కోరుకుంటున్నానని అన్నారు. తొందర్లోనే నిజాలేమిటో తేలిపోవాలని భగవంతున్ని కోరుకుంటున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.