Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు... కాట్రేడు వాగులో కొట్టుకుపోయిన యువకుడు


గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.


గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో కాట్రేడు వాగు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లపైకి కూడా భారీ నీరు చేరింది. ఈ నీటిలోనే రోడ్డును దాటే ప్రయత్నం చేసిన ఓ యువకుడు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. గల్లంతయిన యువకుడు దాచేపల్లి మండలం కేశనపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో వాగులో గల్లంతయిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భారీ వర్షాలతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం ఎవరూ చేయరాదని పోలీసులు సూచించారు.