Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కొనసాగుతున్న భారత్ బంద్...అధికార వైసిపి సహా అందరూ రోడ్లపైకి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు దేశవ్యాప్తంగా రైతులు, ప్రజల మద్దతే కాదు చాలా రాజకీయ పార్టీల మద్దతు కూడా లభించింది. ఈ బంద్ ఆంధ్ర  ప్రదేశ్ లో ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపి, వామపక్ష పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి.