Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ జయంతి సాక్షిగా... పల్నాడు వైసిపిలో బయటపడ్డ వర్గపోరు

వైఎస్సార్  జయంతి సాక్షిగా పల్నాడు జిల్లా వైసిపిలో వర్గపోరు బయపడింది. 

వైఎస్సార్  జయంతి సాక్షిగా పల్నాడు జిల్లా వైసిపిలో వర్గపోరు బయపడింది. నిన్న చిలకలూరపేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజని, వైసిపి నేత జాన్ సైదా వేరువేరుగా వైఎస్సార్ జయంతి వేడుకలు జరిపారు. చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో ఉదయం మంత్రి రజని ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో జాన్ సైదా పాల్గొనకుండా సాయంత్రం తన వర్గంతో కలిసి వేరుగా వైఎస్సార్ జయంతి జరిపారు.  చిలకలూరిపేట టౌన్ తో పాటు ఎడ్లపాడు,రాజపేట,పోతావరం,మణికొండ వారి పాలెం లలో సైదా వర్గం వైఎస్సార్ జయంతి వేడుకలు జరిపారు. దీంతో గతకొంతకాలంగా మధ్య వైసిపిలో జరుగుతున్న వర్గపోరు బయటపడింది. 
 

Video Top Stories