Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగి అని భయపడి చికిత్సకు నిరాకరణ: మహిళ మృతి

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిన్న రాత్రి లక్ష్మీ దేవి అనే మహిళ శ్వాశ తీసుకోడానికి ఇబ్బంది పడుతు వైద్యం కోసం ఆసుపత్రికి  వచ్చింది. డాక్టర్లు ఆమెకి ప్రథమ చికిత్స మాత్రమే చేసి అక్కడినుండి పంపించి వేశారు.మహిళ కుమారుడు లక్షీదేవిని ఆసుపత్రిలో  జాయిన్ చేసుకోమని వైద్యులను కోరాడు.అందుకు వైద్యులు రెడ్ జోన్ ప్రాంతం నుండి వచ్చారని ఇక్కడి నుండి వెళ్లిపోవాలని  సూచించారు.చేసేదేమీ లేక మహిళను తీసుకుని ఇంటికి వెళ్ళాక అమె కొద్దిసేపటికి మరణించింది..వైద్యులు లక్షీదేవిని  అసుపత్రిలో ‌జాయిన్ చేసుకొని  ఉంటే మరణించించేది కాదని మృతురాలి కొడుకు,బంధువులు అరోపిస్తూన్నారు.