Asianet News TeluguAsianet News Telugu

ఇళ్లు కూల్చేసిన అధికారులు... మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నం

పల్నాడు : ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మడలం నల్ల గార్లపాడు గ్రామంలో ఓ ఇంటికి అధికారులు కూల్చివేసారు.

పల్నాడు : ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మడలం నల్ల గార్లపాడు గ్రామంలో ఓ ఇంటికి అధికారులు కూల్చివేసారు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆ ఇంటి కోడలు ఉమామహేశ్వరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబసభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ముప్పై ఏళ్లనుండి తాము ఇక్కడే నివాసం వుంటున్నామని... ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కక్షగట్టి తమ ఇళ్లు కూలగొట్టించాడని బాధిత మహిళ నంబూరి యోగమ్మ ఆరోపించారు. ప్రభుత్వ స్థలం అంటూ  ఇంటిని కూల్చివేయడం దారుణమని అన్నారు. ఇళ్ళు కూల్చడంతో తీవ్ర మనస్థాపానికి గురయి కోడలు ఉమామహేశ్వరి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని... ఆమెకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని యోగమ్మ హెచ్చరించారు. 

Video Top Stories