Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల చిన్నారిపై జాతి కుక్కల దాడి.. ఓనర్లు కంట్రోల్ చేసినా...

కర్నూలు జిల్లా డోన్ లోని సుందర్ సింగ్ కాలనీలో ఓ ఇంటివారు పెంచుకుంటున్న కుక్కలు మూడేళ్ల చిన్నారిపై దాడి చేశాయి.

కర్నూలు జిల్లా డోన్ లోని సుందర్ సింగ్ కాలనీలో ఓ ఇంటివారు పెంచుకుంటున్న కుక్కలు మూడేళ్ల చిన్నారిపై దాడి చేశాయి. ఆ ఇంట్లోని చిన్నపాపతో ఆడుకోవడానికి వెళ్లిన పక్కింటి చిన్నారిపై ఎగబడ్డాయి. ఓనర్లు విడిపించినా విడవకుండా కొరికేశాయి. పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. డాబర్ మెన్ జాతికి చెందిన రెండు కుక్కలను ఆ ఇంటివాళ్ల కూతురు కర్నూలు నుండి తెచ్చి ఇక్కడ వదిలిందట. వాటిని ఇక్కడినుండి పంపించకపోతే కొట్టి చంపుతామని స్థానికులు అంటున్నారు.