బెజవాడ గ్యాంగ్ వార్.. అసలేం జరిగింది?... (వీడియో)
విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతోపాటుగా, వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తొలుత సందీప్, పండులు సన్నిహితులైనప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్లుగా విడిపోయారు. వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బెజవాడలో ల్యాండ్ సెటిల్మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి, గుంటూరు జిల్లాలో వివాదాలకు బెజవాడ యువకులను ఈ గ్యాంగ్లు తమ వెంట తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.