Asianet News TeluguAsianet News Telugu

'డిస్ ప్లే లో తక్కువ... బిల్లులో ఎక్కువ ధర..: డి మార్ట్ లీలలివీ'

విజయవాడ : తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తూ మద్య తరగతి ప్రజలకు చాలా దగ్గరయ్యింది డి మార్ట్ సూపర్ మార్కెట్. 

విజయవాడ : తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తూ మద్య తరగతి ప్రజలకు చాలా దగ్గరయ్యింది డి మార్ట్ సూపర్ మార్కెట్. అయితే ఇటీవల కాలంలో ఈ డి మార్ట్ వివాదాల్లో నిలుస్తోంది. ఒకే వస్తువుకు రెండుసార్లు బిల్లు వేసి వినియోగదారులను డి మార్ట్ సిబ్బంది మోసం చేస్తున్న వ్యవహారం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా విజమవాడలోని డి మార్ట్ లో డిస్ ప్లే లో తక్కువ ధర చూపించి బిల్లు మాత్రం ఎక్కువగా వేస్తున్నట్లు వినయోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నించగా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. వెంటనే లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Video Top Stories