Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయానికి కరోనా ఎఫెక్ట్.. 3,4 బ్లాకుల్లోకి నో ఎంట్రీ

ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది

ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు భయపెడుతుంటే తాజాగా సచివాలయ ఉద్యోగుల్ని వైరస్ టెన్షన్ వెంటాడుతోంది. సచివాలయంలోని మరో ఇద్దరు ఉద్యోగులకు వైరస్ వచ్చినట్లు తేలడంతో 3,4 బ్లాకుల్లోకి ఎంట్రీ నిషేధించారు. సెక్రటేరియట్ మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. 3,4 బ్లాకుల్లో పని చేసే సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.మిగతా బ్లాకుల్లోనూ అంతంత మాత్రంగానే ఉద్యోగుల హాజరయ్యారు. సచివాలయానికి కరోనా తాకిడితో  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్జి తన రివ్యూలను విజయవాడ ఆర్ అండ్ బి భననంలోని ఏపీటీఎస్ కార్యాలయం నుంచి చేస్తున్నారు.