Asianet News TeluguAsianet News Telugu

ఇళ్లంతా రక్తసిక్తం... అత్యంత కిరాతకంగా కుటుంబం మొత్తాన్ని హతమార్చి...

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణం జరిగింది. అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు ఇంట్లో రక్తం మడుగులో పడి ఉన్నాయి. ఇంట్లో నిద్రిస్తున్నవారిపై నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

Video Top Stories