Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులు మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఏలూరు మిని బైపాస్ మీదుగా విజయవాడ వైపు వెళ్తున్న కారు ఇలా ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.