Asianet News TeluguAsianet News Telugu

250 రోజుల ఉద్యమాన్ని చూసి అయినా ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోవాలి నారా లోకేష్

పాలకుడు మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం

పాలకుడు మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం.జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ.మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు.
రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250రోజులు అయ్యింది.ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి.రాజధాని ని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి అని ట్వీట్ చేసాడు లోకేష్