Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని ఇలాకాలో అమరావతి రైతుల పాదయాత్ర... గుడివాడలో ఉద్రిక్తత

గుడివాడ : అమరావతి రైతులు అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తంగా మారింది. 

గుడివాడ : అమరావతి రైతులు అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం మీదుగా రైతుల పాదయాత్ర సాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలోని శరత్ టాకీస్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వైసిపి నాయకులు, కార్యకర్తలు జై కొడాలి నాని అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అమరావతికి మద్దతుగా రైతులు కూడా నినాదాలు చేసారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రైతులను ముందుకు పంపించారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కటౌట్ కు చెప్పు చూపిస్తూ టిడిపి ఎంపీ మాగంటి బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.