Asianet News TeluguAsianet News Telugu

బడితె పూజ-మంత్రి వార్నింగ్... టచ్ చేసి చూడు-మాజీ మంత్రి కౌంటర్: విజయవాడలో టెన్షన్

విజయవాడ: పేకాట క్లబ్బుల విషయంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్దం కాస్త వ్యక్తిగత యుద్దానికి దారితీసింది.

విజయవాడ: పేకాట క్లబ్బుల విషయంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్దం కాస్త వ్యక్తిగత యుద్దానికి దారితీసింది. ఇటీవల గుడివాడలో పేకాట క్లబ్బులపై దాడులు చేయాలని తాము చెబితే పోలీసులు నిర్వహించారని... ఈ విషయమై దేవినేని ఉమ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాని మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానంటూ దేవినేనిని హెచ్చరించారు.

అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడ అదే స్థాయిలో కౌంటరిచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. విజయవాడ గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని ప్రకటించారు. తన దీక్ష వద్దకు సీఎం వస్తారో కొడాలి నాని వస్తారో రావాలంటూ దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ విగ్రహాం వద్ద తాను దీక్ష చేసే  సమయంలో టచ్ చేసి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే విజయవాడ గొల్లపూడి సెంటర్ లో ఇవాళ(మంగళవారం) దేవినేని ఉమ దీక్షకు సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో దేవినేని ఉమ ఇళ్లు, ఎన్టీఆర్ విగ్రహం వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది.