Asianet News TeluguAsianet News Telugu

వెలగపూడిలో ఉద్రిక్తత... ఇరువర్గాల రాళ్లదాడిలో మహిళ మృతి

గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుకు ఆర్చి నిర్మాణం విషయంలో గత రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన గొడవ పరస్పరం రాళ్లు రువ్వుకున్నే స్థాయికి చేరుకుంది. ఈ రాళ్ళదాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో చనిపోయిన మహిళ మృత దేహాన్ని రోడ్డుపై పెట్టి బంధువులు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో వెలగపూడి రాస్తారోకో వద్దకు చేరుకున్న హోమ్ మినిష్టర్ సుచరిత, ఎంపీ నందిగం సురేష్. మృతురాలు బుజ్జి భౌతిక కాయాన్ని సుచరిత సందర్శించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మద్య కొద్దిపాటి తోపులాట జరిగింది.