Asianet News TeluguAsianet News Telugu

వినుకొండలో ఉద్రిక్తత, ఒకరిపై ఒకరు రాళ్లు, సోడాలు విసురుకున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు

ఉమ్మడి  గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను  చెదరగొట్టేందుకు  పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. 

ఉమ్మడి  గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను  చెదరగొట్టేందుకు  పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గత కొంతకాలంగా టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ  వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  ప్రభుత్వ భూముల ఆక్రమణ,మట్టి తవ్వకాలకు  సంబంధించి రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు  చోటు  చేసుకున్నాయి.    మట్టి అక్రమ రవాణాను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు  ర్యాలీ నిర్వహించారు . ఈ ర్యాలీ నిర్వహించిన  టీడీపీ శ్రేణులపై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును నిరసిస్తూ  గురువారంనాడు ఉదయం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.   తమ ర్యాలీని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయని  టీడీపీ ఆరోపిస్తుంది.ఈ క్రమంలోనే  రెండు పార్టీలకు చెందిన శ్రేణుల మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది.   రాళ్లు, కర్రలతో రెండు పార్టీల నేతలు  దాడులు  చేసుకున్నారు.  మరో వైపు వినుకొండ ఎమ్మెల్యే  బ్రహ్మనాయుడు కాన్వాయ్ పై  కూడ  టీడీపీ వర్గీయులు దాడికి దిగారు.