Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా హిజ్రాలను కిడ్నాప్ చేసిన తెలంగాణ హిజ్రా గ్యాంగ్... ఎందుకో తెలుసా?

దాచేపల్లి : తెలంగాణకు చెందిన హిజ్రాల గ్యాంగ్ తమను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు హిజ్రాలు ఆరోపించారు. 

దాచేపల్లి : తెలంగాణకు చెందిన హిజ్రాల గ్యాంగ్ తమను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు హిజ్రాలు ఆరోపించారు. భిక్షాటన చేసిన డబ్బులు సగం  హిజ్రాల సంఘానికి ఇవ్వాలనా కోరగా అందుకు నిరాకరించామని తమపై 100మందికి పైగా తెలంగాణ హిజ్రాలు దాడికి పాల్పడినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి వచ్చి జీవనం సాగిస్తున్న తమను కార్లు, ఆటోల్లో వచ్చిన హిజ్రాల గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని... మిర్యాలగూడకు తరలించి ఓ గదిలో బంధించినట్లు బాధిత హిజ్రాలు తెలిపారు. తోటి హిజ్రాలమన్న జాలి లేకుండా తెలంగాణ హిజ్రాల గ్యాంగ్ తమను చితకబాదుతూ చిత్రహింసలకు గురిచేసారని అన్నారు. పోలీసుల సాయంతో చివరకు ఈ గ్యాంగ్ బారినుండి తప్పించుకున్నామని బాధిత హిజ్రాలు కన్నీరుపెట్టుకుంటూ వివరించారు.