Asianet News TeluguAsianet News Telugu

లోకేశ్ 400 రోజుల పాదయాత్రకు 400 కొబ్బరికాయలు... టిడిపి ఎస్సి సెల్ ప్రత్యేక పూజలు

అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్ర జయప్రదం కావాలని టిడిపి శ్రేణులు దేవుళ్లను కోరుకుంటున్నారు. 

అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్ర జయప్రదం కావాలని టిడిపి శ్రేణులు దేవుళ్లను కోరుకుంటున్నారు. ఇటీవల తెలుగు మహిళలు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా తాజాగా టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అనంతపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేశ్ 'యువగళం' పాదయాత్ర విజయవంతం కావాలని నార్పల మండలం గూగూడులోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కుళ్ళాయిస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ఎస్ రాజు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం లోకేశ్ పాదయాత్ర 400 రోజులు కొనసాగనున్న నేపథ్యంలో 400 కొబ్బరికాయలు కొట్టారు.