Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును చూసి భయపడే... కందుకూరు, గుంటూరులో జగన్ కుట్రలు : నిమ్మల సంచలనం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో ఆరితేరిపోయారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 

First Published Jan 3, 2023, 1:51 PM IST | Last Updated Jan 3, 2023, 1:51 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో ఆరితేరిపోయారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గుంటూరులో చంద్రబాబు అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలొ ముగ్గురి మృతికి సీఎం జగన్, వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోయేలా ప్రభుత్వమే ప్రేరేపించి అందుకు చంద్రబాబే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గతంలో తుని రైలు దహనం, కోడి కత్తి డ్రామా, సొంత బాబాయ్ బాత్రూంలో హత్య... వీటన్నింటికి చంద్రబాబే కారణమన్న జగన్ ఇప్పుడు తొక్కిసలాటలపై కూడా అలాంటి తప్పుడు ప్రచారమే చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు.