Asianet News TeluguAsianet News Telugu

అమరావతి నిరసనలు : భోగిమంటల్లో బోస్టన్ కమిటీ, జియన్ రావు కమిటీ నివేదికలు

తుళ్ళూరు, మందడంలలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ లు భోగి మంటలు వేసారు.

తుళ్ళూరు, మందడంలలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ లు భోగి మంటలు వేసారు. జియన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను మంటల్లో వేసి నిరసనలు తెలిపారు. అనంతరం భోగి మంటలు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ జై అమరావతి-జై జై అమరావతి అని నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొన్నారు. గోమాతలకు పూజలు చేసి భోగి మంటల చుట్టూ గోమాతను ప్రదక్షిణలు చేయించారు.