Asianet News TeluguAsianet News Telugu

AP Assembly : మీడియాకు సంకెళ్ళా..? పాత్రికేయులపై పగ ఎందుకు?

మీడియా మీద ఆంక్షలు ఎత్తివేయాలంటూ తెలుగుదేశం సభ్యులు నల్ల బాడ్జీలతో, నల్ల ప్లకార్డులతో అసెంబ్లీకి ర్యాలీ నిర్వహించారు. 

మీడియా మీద ఆంక్షలు ఎత్తివేయాలంటూ తెలుగుదేశం సభ్యులు నల్ల బాడ్జీలతో, నల్ల ప్లకార్డులతో అసెంబ్లీకి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామానికి నాలుగో మూల స్థభం అయిన మీడియాపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెడతాం అని చట్టం తీసుకువచ్చారని, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి వారిని భయపెట్టి కేబుల్ నెట్వర్క్ లో  ఛానెల్స్ నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు. వెంటనే 2430జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వైసిపి నాయకులపై యాక్షన్ తీసుకోవాలన్నారు.