Asianet News TeluguAsianet News Telugu

చేనేత వ్యాపారులపై వైసీపీ నేత దాడి..మంగళగిరి పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఫిర్యాదు

ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ గుప్తా పైశాచిక దాడిని మంగళగిరి టీడీపీ చేనేత విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. 

ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ గుప్తా పైశాచిక దాడిని మంగళగిరి టీడీపీ చేనేత విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. సాటి చేనేత విభాగం వారైన గిరిరాజు శశి, కోటం ఆనంద్ లపై జరిగిన దాడిపై ఆలయ సిల్క్స్ యాజమాని అవినాష్ గుప్తాను విచారించి, కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి పట్టణ ఎస్‌.హెచ్.ఓ కు చేనేత విభాగం నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం తహశీల్ధార్ కార్యాలయంలో అవినాష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ముందుగా వస్త్ర వ్యాపారులపై దాడిని ఖండిస్తూ మంగళగిరి ఎమ్మెస్సెస్ కార్యాలయం నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నిరసన చేపట్టారు.      

Video Top Stories