Asianet News TeluguAsianet News Telugu

పది తలల జగన్ దిష్టిబొమ్మలతో... రాష్ట్రవ్యాప్తంగా టిడిపి వినూత్న నిరసన

అమరావతి  : తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.

First Published May 1, 2023, 6:14 PM IST | Last Updated May 1, 2023, 6:14 PM IST

అమరావతి  : తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఇలా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టిడిపి శ్రేణులతో కలిసి జగనాసుర రక్త చరిత్ర పేరిట పది తలలతో కూడిన జగన్ పోస్టర్ ను మంటల్లో వేసి తగలబెట్టారు. ఇక గుంటూరులో కోవెలమూడి రవీంద్ర (నాని) ఆధ్వన్యంలో పదితలల జగన్ దిష్టిబొమ్మతో ర్యాలీ చేపట్టారు.ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇక వినుకొండలొనూ జగనాసుర అవినీతి నేర రాక్షసుడు పేరిట పదితలలతో కూడిన జగన్ దిష్టిబొమ్మను దహనం చేసారు. తిరువూరు పట్టణంలోని  ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.