Asianet News TeluguAsianet News Telugu

ఇది నా ఖర్మ... తన చెప్పుతో తానే కొట్టుకున్న నర్సీపట్నం టీడీపీ మునిసిపల్ కౌన్సిలర్..!

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం  మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారంనాడు  గందరగోళం చోటు  చేసుకుంది. 

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం  మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారంనాడు  గందరగోళం చోటు  చేసుకుంది. తమ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలని  పలువురు కౌన్సిలర్లు  కోరారు. ఇవాళ  మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన  నర్సీపట్నం  మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.  మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైనా ప్రజల సమస్యలను  పరిష్కరించడంలో తాను  విఫలమైనట్టుగా  టీడీపీ కౌన్సిలర్  రామరాజు ఆవేదన వ్యక్తం  చేశారు. కౌన్సిలర్ గా ఎన్నికైన  30 నెలలు అవుతున్నా  తన వార్డులో  మంచినీటి కుళాయిని కూడ ఏర్పాటు చేయించలేని పరిస్థితి నెలకొందని ఆయన  తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ   టీడీపీ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నారు.