Asianet News TeluguAsianet News Telugu

టీచర్లూ జాగ్రత్త... డబ్బు ఆశ చూపించి కొనాలని చూస్తున్నారు:చంద్రబాబు

అమరావతి : ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

First Published Mar 12, 2023, 4:00 PM IST | Last Updated Mar 12, 2023, 4:00 PM IST

అమరావతి : ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విద్యావంతులైన టీచర్లు ఆలోచించి ఓటేయాలని... మీ సమస్యలపై ఎవరు బలంగా పోరాడతారో వారికే ఓటేసి గెలిపించుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు ఈ జగన్ రెడ్డి మీకు టిఏ, డిఏ ఎందుకు ఇవ్వడం లేదు?
జీతాలు ఎందుకు పెంచలేదు ? మొదటి తారీకునే జీతాలు ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలో వుండగా టీచర్లకు నెలనెలా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చామని... పండుగ వచ్చినప్పుడు ముందుగానే జీతాలు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.