Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో వింత దేవుడు... మాట్లాడుతున్న షిరిడి సాయిబాబా విగ్రహం

విశాఖపట్నం : మాట్లాడే దేవున్ని ఎక్కడైనా చూసారా..? చూడకుంటే మీరు విశాఖపట్నం వెళ్లాల్సిందే. విశాఖ గ్రామీణ మండలం చినగాదిలోని ఆలయంలో సాక్షాత్తు షిరిడి సాయిబాబా విగ్రహం కళ్లు కదపడం, మాట్లాడటం చేస్తోంది. 

విశాఖపట్నం : మాట్లాడే దేవున్ని ఎక్కడైనా చూసారా..? చూడకుంటే మీరు విశాఖపట్నం వెళ్లాల్సిందే. విశాఖ గ్రామీణ మండలం చినగాదిలోని ఆలయంలో సాక్షాత్తు షిరిడి సాయిబాబా విగ్రహం కళ్లు కదపడం, మాట్లాడటం చేస్తోంది. ఇదేదో మాయో, మంత్రమో కాదు... టెక్నాలజీతోనే ఇది సాధ్యమయ్యింది. ఓ యువకుడు మూడేళ్లు కష్టించి టెక్నాలజీ సాయంతో సాయిబాబా విగ్రహం కళ్లు కదపడం, నోరుతెరిచి మాట్లాడేలా చేసాడు. చిన గాదిలి ఆలయంలో ప్రతిష్టించిన ఈ రోబోటిక్ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.