Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా, తెనాలిలో లారీ వెనక నుంచి ఆటోని ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా, తెనాలిలో లారీ వెనక నుంచి ఆటోని ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఎద్దు సుబ్బారావు (60) అక్కడికి అక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన కొంతమంది కూలి పనులు నిమిత్తం.. సంఘం జాగర్లమూడి సెంటర్లో ఆటో ఎక్కి తెనాలి వైపుకు వెడుతుండగా.. అంగలకుదురు సాయిబాబా గుడి దగ్గరికి వచ్చేసరికి ఆటోని.. వెనకనుండి వేగంగా వచ్చిన లారీ గుద్దింది. దీంతో ప్రమాదం జరిగింది.