Asianet News TeluguAsianet News Telugu

అంబేద్కర్ ఫోటోను తొలగించి సీఎం జగన్ ఫోటో...కృష్ణాజిల్లాలో సచివాలయ సిబ్బంది నిర్వాకం

కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సచివాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై గ్రామస్తుల ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో పెట్టడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి ఫోటో తీసివేసి తిరిగి యధాస్థానంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. 

Video Top Stories