Asianet News TeluguAsianet News Telugu

కుంజన ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

కడప జిల్లా  రైల్వే కోడూరు సమీపంలో బాలపల్లి బీట్ పరిధిలో ఎర్ర చందనం  దుంగలు తరలిస్తున్న పది మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు  చేశారు. నిందితుల నుండి  19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం  చేసుకున్నారు.

కడప జిల్లా  రైల్వే కోడూరు సమీపంలో బాలపల్లి బీట్ పరిధిలో ఎర్ర చందనం  దుంగలు తరలిస్తున్న పది మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి  19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం  చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనలతో  ఆర్ ఐ ఆలీబాషా, ఆర్ ఎస్ ఐ లక్షణ్ ల టీమ్ బాలపల్లి బీట్ లో మంగళవారం  సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. కుంజన ఫారెస్ట్ లో మాటువేసిన టాస్క్  ఫోర్స్ టీం కి బుధవారం తెల్లవారు జామున కొండ దిగుతున్న దాదాపు 25  మంది స్మగ్లర్లు కనిపించారు. వీరిలో కొంతమంది పారిపోగా పదిమందిని  పట్టుకున్నారు.