దారుణం : చెత్తకోసం గొడవ..మాజీ సర్పంచ్ మృతి...
కర్నూల్ జిల్లా, వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో చెత్త విషయంలో జరిగిన గొడవ సర్పంచ్ మృతికి కారణమయ్యింది.
కర్నూల్ జిల్లా, వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో చెత్త విషయంలో జరిగిన గొడవ సర్పంచ్ మృతికి కారణమయ్యింది. వివరాల్లోకి వెడితే గ్రామంలో చెత్త విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ లో మాజీ సర్పంచ్ నాగమ్మకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో మరో ఆరు మందికి గాయాలయ్యాయి.