Asianet News TeluguAsianet News Telugu

ఒక్కసారిగా విద్యార్థులకు అస్వస్థత... పరామర్శించిన మంత్రి నాని

కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ ప్రైవేట్ తెలుగుమీడియం స్కూల్లో విద్యార్థులు ఒక్కసారిగా ఆస్వస్థతకు గురయ్యారు. 

కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ ప్రైవేట్ తెలుగుమీడియం స్కూల్లో విద్యార్థులు ఒక్కసారిగా ఆస్వస్థతకు గురయ్యారు. ఇలా అనారోగ్యానికి గురయిన విద్యార్థులను గుర్తించిన టీచర్లు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలియగానే మంత్రి కొడాలి నాని, ఎస్పి రవీంద్రనాథ్, జెసి మాదవిలత గుడివాడ చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.