Asianet News TeluguAsianet News Telugu

గ్రామానికి అరిష్టమని.. నిండు గర్భిణీ మృతదేహాన్ని.. (వీడియో)

కర్నూలుజిల్లా రుద్రవరం మండలం బి నాగిరెడ్డి పల్లిలోమూఢనమ్మకాలు ఓ నిండు గర్భిణికి చనిపోయిన తరువాత కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా చేశాయి. 

కర్నూలుజిల్లా రుద్రవరం మండలం బి నాగిరెడ్డి పల్లిలోమూఢనమ్మకాలు ఓ నిండు గర్భిణికి చనిపోయిన తరువాత కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా చేశాయి. నాగిరెడ్డి పల్లెకు చెందిన 20 యేళ్ల లావణ్య ప్రసవంలో ఇబ్బందితో, ఆస్పత్తిలో సరైన వైద్యం అందక మరణించింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గర్భిణీ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తే గ్రామానికి అరిష్టం అంటూ మూఢ నమ్మకంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక చేసేదేమీలేక కుటుంబీకులు లావణ్య మృతదేహాన్ని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వచ్చారు. అడవిలో దారి పొడవునా పూలు చల్లి ఉండటంతో గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబీకులు, గ్రామస్తులతో మాట్లాడి  అంత్యక్రియలు జరిగేలా చూశారు.