Asianet News TeluguAsianet News Telugu

రాత్రి పూట ఊర్లో కరెంటు తీసి.. కరోనా మృతదేహం ఖననం...

తుళ్ళూరు బాలయేసు కాలనీలో ఉన్న స్మశానవాటికలో రాత్రిపూట కరోనా మృతదేహాన్ని ఖననం చేయడం కలకలం రేపింది.

తుళ్ళూరు బాలయేసు కాలనీలో ఉన్న స్మశానవాటికలో రాత్రిపూట కరోనా మృతదేహాన్ని ఖననం చేయడం కలకలం రేపింది. రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఊర్లో మొత్తం కరెంట్ తీసేసి, స్మశానం గేట్లు పగలగొట్టి ఓ శవాన్ని పూడ్చడం అనుమానాలకు తెరతీసింది. అతను మామూలుగానే చనిపోయాడని సిబ్బంది చెబుతున్నా.. మున్సిపల్ వాహనంలో తీసుకురావడం, పీపీఈ కిట్లు వేసుకుని ఖననం చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.