Asianet News TeluguAsianet News Telugu

జాతీయ యువజన దినోత్సవం... వివేకానందునికి సీఎం జగన్ ఘన నివాళి

అమరావతి : వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మహనీయున్ని స్మరించుకుని నివాళులు అర్పించారు.

First Published Jan 12, 2023, 12:42 PM IST | Last Updated Jan 12, 2023, 12:42 PM IST

అమరావతి : వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మహనీయున్ని స్మరించుకుని నివాళులు అర్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వివేకానందుని చిత్రపటానికి పుష్ఫాంజలి ఘటించి ఘననివాళి అర్పించారు ముఖ్యమంత్రి జగన్. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడితో పాటు క్యాంప్ కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

'''యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేసారు.