Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నర్సీపట్నం ఎమ్మెల్యే

పెద్దబొడ్డేపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. 

పెద్దబొడ్డేపల్లి గ్రామంలో , ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రోజాకి ధన్యవాదాలు తెలిపారు.  కాలుష్య నివారణ పైన ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, భాగస్వాములై మొక్కలు నాటాలని గణేశ్ పిలుపునిచ్చారు. మన వంతుగా ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కానీ పండ్ల మొక్కలు, జనాలకు ఉపయోగపడే చెట్లను నాటి వాటిని కాపాడాలని ఎమ్మెల్యే సూచించారు . ఈ మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్న ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా, ఎంపీ సంతోష్ కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.