అచ్చెన్నాయుడు కుటుంబానికి లోకేష్ ఓదార్పు..
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరారు.
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడుకుటంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరారు. పార్టీ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్ లపై ప్రభుత్వంపై పోరాడుతూనే, మరోప్రక్క ఆందోళన చెందుచున్న ఆయా నేతల కుటుంబాలను పరామర్శించి, పార్టీ అండగా వుంటుందని మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసానిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకువెళుతున్న నారా లోకేష్ కు విశాఖజిల్లా పాయకరావు పేట నియోజకవర్గం వేంపాడు టోల్ ప్లాజా వద్ద టిడిపి కార్యకర్తలు స్వాగతం పలికారు.