Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించిన లోకేష్

 కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చేరుకున్న మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు.

 కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చేరుకున్న మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. వైసిపి ప్రభుత్వంతో పాటు అనపర్తి ఎమ్మెల్యే  అవినీతిని ఎండగట్టినందుకే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని లోకేష్ పేర్కొన్నారు. 

మూడు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి బావ సత్తిరాజు రెడ్డి అనుమానాస్ప స్థితిలో మరణించారు. అయితే మృతుడి భార్య రామకృష్ణా రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను అరెస్టయి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు.