Asianet News TeluguAsianet News Telugu

బైకు ర్యాలీకోసం ట్రాక్టర్ పై వచ్చిన నన్నపనేని రాజకుమారి..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ టీడీపీ, రాజధాని రైతులు మంగళగిరిలోని కృష్ణాయపాలెం నుండి బైకుర్యాలీకి పిలుపునిచ్చాయి. 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ టీడీపీ, రాజధాని రైతులు మంగళగిరిలోని కృష్ణాయపాలెం నుండి బైకుర్యాలీకి పిలుపునిచ్చాయి. అయితే బైకుర్యాలీ ప్రారంభించేకృష్ణాయపాలెం అర్బన్ పరిధి లో రైతులు ఎటువంటి ర్యాలీలకు అనుమతి తీసుకోలేదు. దీంతో కృష్ణాయపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో వాహనాలు పక్కన పెట్టి కాలి నడకన రైతులు కృష్ణాయపాలెం గ్రామంలోకి చేరుకున్నారు. ఈ ర్యాలీలో మహిళలూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా ట్రాక్టర్ పై కృష్ణాయపాలెం చేరుకున్నారు. సచివాలయం, అసెంబ్లీ వద్ద ముందు జాగ్రత్త గా పోలీసు బలగాలు మోహరించాయి.