Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో దారుణం... కన్న కొడుకును కిరాతకంగా చంపిన కసాయి తల్లి

గన్నవరం : ఓ కసాయి తల్లి కన్న కొడుకును అతి కిరాతకంగా కొట్టిచంపిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.

గన్నవరం : ఓ కసాయి తల్లి కన్న కొడుకును అతి కిరాతకంగా కొట్టిచంపిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన ఉప్పలపాటి దీప్ చంద్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు తల్లి రమాదేవి తెలిపింది. ఇంట్లోనే మంచం తగిలి చనిపోయినట్లు చెప్పగా ఆమె మాటలు అనుమానాస్పదంగా వుండటంతో పోలీసులు విచారించారు. దీంతో తానే చంపినట్లు రమాదేవి అంగీకరించినట్లు డిఎస్పీ విజయపాల్ తెలిపారు. ఇంటీరయల్ పని చేసే దీప్ చంద్ అవసరాల కోసం 50లక్షలకు పైగా అప్పు చేసాడు. ఈ అప్పులు ఎక్కడ తమపై పడతాయోనని అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. ఈ క్రమంలోనే కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకున్న రమాదేవి ఇంట్లో ఎవ్వరూ లేనిసమయంలో రోకలిబండతో కొట్టిచంపింది. మంచం తగిలి కొడుకు చనిపోయాడంటూ కట్టుకథ అల్లగా పోలీసులు అనుమానంతో విచారించగా అసలు నిజం బయటపడింది.