Asianet News TeluguAsianet News Telugu

గురజాలలో అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారం

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలు కలకలం సృష్టిస్తున్నాయి. పసిపాప నుండి పండుముసలి వరకు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా  గురజాల పట్టణంలోని వెంకట్రావు నగర్ కాలనీలో ఆరేళ్ళ బాలికపై 16సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అఘాయిత్యానికి పాల్పడిన మైనర్ బాలుడు  పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు గురజాల డి.ఎస్.పి జయరాం ప్రసాద్ తెలిపారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలు కలకలం సృష్టిస్తున్నాయి. పసిపాప నుండి పండుముసలి వరకు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా  గురజాల పట్టణంలోని వెంకట్రావు నగర్ కాలనీలో ఆరేళ్ళ బాలికపై 16సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అఘాయిత్యానికి పాల్పడిన మైనర్ బాలుడు  పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు గురజాల డి.ఎస్.పి జయరాం ప్రసాద్ తెలిపారు.