మొబైల్ కోవిడ్ టెస్టులు నిర్వహణకు ఏర్పాట్లు...: మంత్రి వెల్లంపల్లి
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 104 కమాండ్ కంట్రోల్ రూంను అధికారులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం పరిశీలించారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 104 కమాండ్ కంట్రోల్ రూంను అధికారులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం పరిశీలించారు. 104 కంట్రోల్ రూం పని తీరును జిల్లా కోవిడ్ నోడల్ అధికారి శివశంకర్ మంత్రికి వివరించారు. మూడు షిఫ్టుల్లో దాదాపు 80 మంది సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తున్నారన్నారు. అదే విధంగా ఆసుపత్రుల్లో బెడ్లు ,వైద్య సలహాలు, సందేహాలు కూడా నివృత్తి చేస్తున్నారన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా మొబైల్ కోవిడ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 104 కంట్రోల్ రూం సేవలను బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎక్కడా వెనకంజ వేయొద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.